india will open their 2019 World Cup campaign against South Africa on June 4 instead of June 2. The reason behind the change is that the BCCI will have to maintain a mandatory 15-day gap between IPL final and international assignment as per the Lodha Committee recommendation. <br /> <br />టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ షెడ్యూల్లో మార్పుకు ఐసీసీ సీఈసీ కూడా అంగీకరించింది. దీనిని ఐసీసీ బోర్డుకు సిఫారసు చేశామని ఆ అధికారి వెల్లడించారు. గతంలో వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్లను భారత్-పాకిస్థాన్ మ్యాచ్తో ఐసీసీ ప్రారంభించేది. <br /> <br />2015 వరల్డ్కప్(అడిలైడ్), 2017 చాంపియన్స్ ట్రోఫీ(బర్మింగ్ హామ్) ఇలాగే ప్రారంభమైంది. అయితే ఈసారి టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనుందని ఆ అధికారి చెప్పారు. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్కప్లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్తో ఆడాల్సి ఉంటుంది. <br /> <br />వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. 2019-23 మధ్య ఐదేళ్ల కాలానికి ఎఫ్టీపీని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కాలంలో టీమిండియా మొత్తం 309 రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. అయితే టెస్టు మ్యాచ్ల సంఖ్య 15 నుంచి 19కి పెరిగింది. <br /> <br />ఇవన్నీ కూడా టెస్టు చాంపియన్షిప్లో భాగంగా జరిగేవేనని ఐసీసీ స్పష్టం చేసింది. టెస్టు చాంపియన్షిప్లో ఆడే అన్ని మ్యాచ్లూ డే మ్యాచ్లే కావడం విశేషం. <br />
